Kodumuru: దాహార్తి తీర్చాలంటూ రోడ్డెక్కిన కోడుమూరు మహిళలు!
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి ఎద్దడిపై ఖాళీ బిందెలతో మహిళల ధర్నా. 20 రోజులుగా తాగునీరు అందడం లేదని రోడ్డుపై నిరసన.
Kodumuru: దాహార్తి తీర్చాలంటూ రోడ్డెక్కిన కోడుమూరు మహిళలు!
Kodumuru: కోడుమూరు పట్టణంలో తాగునీటి సమస్య తీర్చడం లేదు అంటు రోడ్డు పై ధర్నా కు దిగిన మహిళలు . పట్టణంలో తాగునీరు 20 రోజులు అవుతున్న రావడం లేదు అని తీవ్ర ఆవేదనకు గురి అయిన మహిళలు ఖాళీ బిందెలతో పట్టణంలోని జాతీయ రహదారి పై ధర్నాకు దిగారు. కొడుమూరు పట్టణానికి శాశ్వత తాగునీటి పథకాలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.
ఓట్లు అడిగే నాయకులు కనీసం తాగటానికి మంచి నీరు అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటూ ప్రజలను మభ్య పెడతారు అని ఆవేదన వక్తం చేస్తున్న మహిళలు.
Next Story




