Kurnool: విపత్కర వేళ యువత సేవాభావంతో ముందుండాలి.. నగరపాలక కమిషనర్

Kurnool: కర్నూలు నగరంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో రోడ్లపై విరిగిపడిన చెట్లను నగర పాలక సంస్థ కమిషనర్ ఓబులేసు ఆదివారం పరిశీలించి తొలగించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 24 May 2026 5:22 PM IST
Kurnool
X

Kurnool: విపత్కర వేళ యువత సేవాభావంతో ముందుండాలి.. నగరపాలక కమిషనర్

Kurnool: ప్రకృతి వైపరీత్యాలు, విపత్కర అత్యవసర పరిస్థితుల సమయాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యల్లో ఎప్పుడూ యువత సేవాభావంతో ముందుండాలని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి నగరంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల చెట్లు విరిగి రహదారులపై పడిపోయినా ప్రదేశాలను ఆదివారం కమిషనర్ చల్లా ఓబులేసు పరిశీలించారు. వెంకటరమణ కాలనీతో పాటు పలు కాలనీల్లో స్వయంగా విరిగిన చెట్ల కొమ్మలను తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

అదేవిధంగా బళ్ళారి చౌరస్తా, కృష్ణనగర్, సి.క్యాంపు, బి క్యాంపు ప్రభుత్వ సముదాయాల ప్రాంతం, జోహరాపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. వెంటనే గ్యాంగ్‌వర్క్ ఏర్పాటు చేసి, పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. విరిగిన చెట్ల తొలగింపు బాధ్యత ప్రధానంగా విద్యుత్ శాఖకు చెందినదైనా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బంది కూడా సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అన్ని శాఖలతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత సేవాభావంతో ముందుకు వచ్చి సామాజిక బాధ్యతగా పునరుద్ధరణ చర్యల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

సిబ్బంది వచ్చేంత వరకు ఎదురుచూడకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు మునిస్వామి, రవి, రమేష్, హుస్సేన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story