Kurnool: కర్నూలులో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై అవగాహన
Kurnool: కర్నూలు బుధవారపేట 36వ సచివాలయంలో వ్యాధి నిరోధక టీకాలపై అవగాహన కల్పించిన అధికారి ప్రకాష్ రాజ్. పిల్లలకు తప్పనిసరిగా డీపీటీ, టీడీ వ్యాక్సిన్లు వేయాలి.
Kurnool: కర్నూలులో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై అవగాహన
కర్నూలు: నగరంలోని బుధవారపేటలోని 36 వ సచివాలయంలొ జరుగుచున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమములో అధికారి ప్రకాష్ రాజ్ పాల్గొని తల్లులకు అవగాహనా కల్పించినారు.
అనంతరం మాట్లాడుతూ 5 సంవత్సరముల నుండి 7 సంవత్సరములలోపు పిల్లలకు డి.పి.టి వ్యాక్సిన్ ధనుర్వాతం,కోరింతదగ్గు, కంఠ సర్పి, మరియు 10 సంవత్సరముల పిల్ల నుంచి 16 సంవత్సరముల వయస్సులోపు పిల్లలకు టి.డి వ్యాక్సిన్ ధనుర్వాతం,కంఠ సర్పివ్యాధులకు గురికాకుండా వేయించుకోవాలని...
ముఖ్యంగా ధనుర్వాతం,కోరింతదగ్గు, కంట సర్పి ఈ మూడు వ్యాధులు బాక్టిరియం ద్వారా వస్తాయని మరియు ప్రమాదకరమైనవి పిల్లల్లో అనారోగ్య పరిస్థితులను,మరణాలను తగ్గించడానికి పిల్లలకు ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమములో డిప్యూటి హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పద్మావతి,సచివాలయ కార్యకర్త పావని, ఆశా కార్యకర్త లక్ష్మి కాంత మరియు ప్రోజేక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.




