Emmiganur Town: ఎమ్మిగనూరులో ఆపరేషన్ వజ్రప్రహర్.. 8 వాహనాలు సీజ్
Emmiganur Town: ఎమ్మిగనూరులో డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ వజ్రప్రహర్లో 280 ఇళ్లలో తనిఖీలు చేసి 8 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
Emmiganur
Emmiganur Town: కర్నూలు జిల్లా; ఎమ్మిగనూరు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ఉదయం 'ఆపరేషన్ వజ్రప్రహర్' నిర్వహించారు. పోలీసులు పలు ప్రాంతాల్లోని 280 ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని ఎనిమిది ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.అలాగే రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతామని డీఎస్పీ భార్గవి స్పష్టం చేశారు.
Next Story




