Kurnool: ఏపీ మెగా యూత్ ఫోర్స్ కో-కన్వీనర్‌గా తోళ్ళ మంజునాథ్

Kurnool: మెగా యూత్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-కన్వీనర్‌గా కర్నూలుకు చెందిన తోళ్ళ మంజునాథ్ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన కొణిదెల సుస్మిత.

Sivaraj kumar, Staff Reporter -Kurnool
Published on: 26 July 2026 5:53 PM IST
Kurnool
X

Kurnool: ఏపీ మెగా యూత్ ఫోర్స్ కో-కన్వీనర్‌గా తోళ్ళ మంజునాథ్

కర్నూల్: కర్నూలుకు చెందిన ఏపీ స్టేట్ వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ తోళ్ళ మంజునాథ్‌ను మెగా యూత్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-కన్వీనర్‌గా నియమించారు.

మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవలో చూపుతున్న అంకితభావం, ప్రజా సేవ పట్ల నిబద్ధత, అలాగే మెగా అభిమానులను ఏకతాటిపై నడిపించే నాయకత్వ లక్షణాలను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు సంస్థ గౌరవ అధ్యక్షురాలు సుస్మిత కొణిదెల తెలిపారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన మెగా అభిమానుల సమావేశంలో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు..ఈ సందర్భంగా తోళ్ళ మంజునాథ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి సంస్థ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మెగాస్టార్ చిరంజీవి సేవా సిద్ధాంతాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Sivaraj kumar, Staff Reporter -Kurnool

Sivaraj kumar, Staff Reporter -Kurnool

కర్నూలు రీజియన్‌లో 2 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. వేగవంతమైన వార్తలు, తాజా అప్‌డేట్స్‌తో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story