Kurnool: టీడీపీ సభలో ఫొటోల గందరగోళం.. నిందితుడికి ఎమ్మెల్యే నివాళి!

Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ నిర్వహించిన దళితుల సంస్కరణ సభలో తీవ్ర కలకలం రేగింది.

S Khaleel, Yemmiganur
Published on: 20 May 2026 6:39 PM IST
Kurnool
X

Kurnool: టీడీపీ సభలో ఫొటోల గందరగోళం.. నిందితుడికి ఎమ్మెల్యే నివాళి!

Kurnool: ఎమ్మిగనూరు లో టీడీపీ నాయకుల నిర్లక్యం తో బాధితుడి ఫోటో తారుమారైంది. ఎమ్మెల్యే పాల్గొనే ఓ కార్యక్రమంలో బాధితుడి ఫొటోకు బదులుగా హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఫోటోను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దింతో వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబు ఫోటో కు టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి నివాళులు అర్పించాల్సి వచ్చింది.

అక్కడున్న పలువురు విషయం గుర్తించినా ఏమి చెప్పక పోవడంతో కార్యక్రమం యధావిధిగా కొనసాగింది.వైసీపీ హయాంలో దళితులకు జరిగిన దామనకండ గుర్తు చేసేందుకు పట్టణంలోని ఎంబీ చర్చ్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. హత్యకు గురైన ఎమ్మెల్సీ ఆనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం,డాక్టర్ సుధాకర్ ఫోటోలను ప్రదర్శించారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur

Next Story