Srisailam: గిరిజన బాలికలకు రక్ష.. ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ

Srisailam: గిరిజన బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకా. శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ.. చెంచు గూడెల్లో పీఎం జన్మన్ ప్రత్యేక కార్యక్రమాలు.

Srikanth Singam, Markapur
Published on: 22 May 2026 7:30 PM IST
Srisailam
X

Srisailam: గిరిజన బాలికలకు రక్ష.. ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ

Srisailam: శ్రీశైలం ఐటిడీఏ ప్రాజెక్ట్ అధికారి శ్రీ పి.వి.ఎస్. నాయుడు ఆదేశాల మేరకు, డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DY.DM&HO) డాక్టర్ టి. రవి మే 21న వెంకటాద్రిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) సబ్ సెంటర్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్ అమలుపై సబ్ సెంటర్ సిబ్బందితో సమీక్ష నిర్వహించి, గ్రామస్తులకు వ్యాక్సిన్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఈ టీకా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer)తో పాటు ఇతర సంబంధిత క్యాన్సర్లను నివారించడంలో సురక్షితమైన మరియు అత్యంత ఉపయోగకరమైన టీకాగా పనిచేస్తుందని వివరించారు.

అలాగే అంగ జననేంద్రియ మొటిమలు (Genital Warts) వంటి సమస్యలను కూడా ఈ వ్యాక్సిన్ ద్వారా తగ్గించవచ్చని తెలిపారు. 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు మొత్తం రెండు డోసులు తీసుకోవాలని, మొదటి డోసు అనంతరం 6 నుండి 12 నెలల వ్యవధిలో రెండో డోసు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం ఇప్పటివరకు 421 హెచ్‌పీవీ వ్యాక్సిన్లను పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చిందని అధికారులు తెలిపారు. యర్రగొండపాలెం మండల పరిధిలోని చెంచు గూడెలకు చెందిన అర్హత కలిగిన బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా, శ్రీశైలం ఐటిడీఏ ఆధ్వర్యంలో మే 18 నుంచి 25 వరకు నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లాల గిరిజన ప్రాంతాల్లో “జన్ భాగిదారి – సబ్ సే దూర్, సబ్ సే పహలే” ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (PTG–చెంచు), శ్రీశైలం ఈ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా అత్యంత వెనుకబడిన గిరిజన తెగల (PVTG) సంక్షేమం, అవగాహన కోసం PM JANMAN మరియు DAJGUA పథకాల కింద వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story