Srisailam: శ్రీశైలం కళ్యాణకట్టలో చైర్మన్ రమేష్ నాయుడు ఆకస్మిక తనిఖీ
Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు కళ్యాణకట్టను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Srisailam: శ్రీశైలం కళ్యాణకట్టలో చైర్మన్ రమేష్ నాయుడు ఆకస్మిక తనిఖీ
Srisailam: శ్రీశైల మహా క్షేత్రంలో దేవస్థానం కళ్యాణ కట్టను ఆకస్మికంగా తనిఖీ చేసిన దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ముందుగా కళ్యాణకట్ట కౌంటర్ ను తనిఖీ చేశారు కళ్యాణ కట్టలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ కల్యాణ కట్టలు సూచి శుభ్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు కళ్యాణ కట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు.
సిబ్బంది అందరూ కూడా సమయపాలనను కచ్చితంగా పాటించాలన్నారు అదేవిధంగా కేశఖండానికి వచ్చే భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా తాగు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు ముఖ్యంగా భక్తులతో మర్యాదగా మెలగాలని మరియు కౌంటర్ సిబ్బందికి సూచించారు. కళ్యాణ కట్టలో విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు సజావుగా పనిచేసే విధంగా సంబంధిత సిబ్బందికి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఎప్పటికప్పుడు వీటిని పరిశీలిస్తుండాలన్నారు సిబ్బంది ఏకరూప దుస్తులు ధరించాలని అన్నారు తరువాత కళ్యాణ కట్ట వద్ద భక్తులతో ముఖాముఖి సంభాషించి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు దేవస్థానం కల్పిస్తున్నారు సౌకర్యాల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని దేవస్థానం చైర్మన్ పోతుంటా రమేష్ నాయుడు తెలిపారు.




