Markapuram: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యత: పఠాన్!

Markapuram: 9వ బ్లాక్‌లో ఒక నిరుపేద కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం టీడీపీ నాయకులు రూ. 5,000 ఆర్థిక సహాయం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 July 2026 11:29 AM IST
Markapuram
X

Markapuram: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యత: పఠాన్!

మార్కాపురం: పట్టణంలోని 9వ బ్లాక్‌లో ఓ నిరుపేద కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.5,000ల ఆర్థిక సహాయాన్ని టీడీపీ నాయకులు అందించారు.

బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ ఇబ్రహీంఖాన్, 9వ బ్లాక్ టీడీపీ ఇన్‌చార్జ్ పఠాన్ నాగూర్ ఖాన్ సంయుక్తంగా బాధిత కుటుంబానికి నగదు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా అవసరమైన వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్ మల్లికార్జున శర్మ, 9వ బ్లాక్ టీడీపీ అధ్యక్షుడు శేఖర్ నాయుడు, టీడీపీ నాయకులు బొప్పరాజు బాలాజీ, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story