Markapuram: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం..పాఠశాలలు, కాలేజీలకు సెలవు!
Markapuram: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ పర్యటన నేపథ్యంలో మార్కాపురం జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు.
Markapuram: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం..పాఠశాలలు, కాలేజీలకు సెలవు!
Markapuram: మార్కాపురం జిల్లా: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా జిల్లాలో నేడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఉత్తర్వులు జారీ చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన, వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు సమాచారం. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు నేడు పనిచేయవు.
Next Story




