Clay Pot Water: మట్టి కుండ నీళ్లు Vs ఫ్రిజ్ నీరు.. వేసవిలో ఏది మంచిది?

వేసవిలో మట్టి కుండ నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, డీహైడ్రేషన్ తగ్గుతుంది. ఫ్రిజ్ నీటి కంటే ఇది ఆరోగ్యానికి ఎందుకు మంచిదో తెలుసుకోండి.

Ramya Vegirouthu
Published on: 4 April 2026 12:42 PM IST
Clay Pot Water
X

Clay Pot Water: మట్టి కుండ నీళ్లు Vs ఫ్రిజ్ నీరు.. వేసవిలో ఏది మంచిది?

Clay Pot Water Benefits : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి నీటి అవసరం అధికమవుతోంది. డీహైడ్రేషన్‌ నుంచి రక్షించుకోవడం కోసం తగినంత నీరు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పూర్వకాలంలో మట్టి కుండలలో నీటిని నిల్వ చేసి తాగడం ఆనవాయితీగా ఉండేది. ఈ నీరు సహజంగా చల్లబడటంతో పాటు ఆరోగ్యానికి అనుకూలంగా ఉండేదని పెద్దలు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం చల్లని నీటి కోసం ఎక్కువ మంది ఫ్రిజ్‌పై ఆధారపడుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మట్టి కుండలో నిల్వ చేసిన నీరు సహజ చల్లదనాన్ని కలిగి ఉండటంతో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలోని pH స్థాయిలను సమతుల్యం చేయడం, మెటబాలిజం పెంచడం వంటి ప్రయోజనాలు కలిగిస్తుందని పేర్కొంటున్నారు.

మట్టి కుండ యొక్క పోరస్‌ స్వభావం వల్ల నీటిలోని మలినాలు కొంతవరకు తొలగి, నీటి నాణ్యత మెరుగుపడుతుంది. అదేవిధంగా హానికర బ్యాక్టీరియా వృద్ధిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుందని చెబుతున్నారు.

అత్యంత చల్లటి నీటిని తాగడం వల్ల జలుబు, గొంతు సమస్యలు, జీర్ణ సమస్యలు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎండలో నుంచి వచ్చిన వెంటనే ఫ్రిజ్‌ నీరు తాగకూడదని సూచిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మట్టి కుండలో నిల్వ చేసిన నీరు శరీర ఉష్ణోగ్రతను సహజంగా నియంత్రించి, వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story