Nagarkurnool: వెల్దండలో మానవత్వం చాటుకున్న 2007-08 బ్యాచ్ మిత్రబృందం!
Nagarkurnool: రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన పదో తరగతి స్నేహితురాలి కుటుంబానికి తోటి మిత్రులు అండగా నిలిచారు.
Nagarkurnool: వెల్దండలో మానవత్వం చాటుకున్న 2007-08 బ్యాచ్ మిత్రబృందం!
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన పుట్ట శ్రీశైలం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అతని భార్య అంజనమ్మ తో చదువుకున్న 2007 - 2008 సంవత్సరం పదవ తరగతి తోటి మిత్రులు విషయం తెలుసుకున్న స్నేహితురాలని పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.
అనంతరం తోటి మిత్రులు చేయూత చేసిన 26,000 వేల రూపాయలు స్నేహితురాలి ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో తోటి స్నేహితులు మాధవులు, సద్దాం, తిరుపతయ్య గౌడ్, శ్రీశైలం, గంటల నరసింహ, సురేష్, శ్రీను, ఆనంద్ కుమార్ గౌడ్, ఎం. తిరుపతి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Next Story




