Talakondapally: అంతారంలో మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ ఆర్థిక సాయం

Talakondapally: తలకొండపల్లి మండలం అంతారంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం. రూ.4,000 అందజేసిన కాంగ్రెస్ నాయకులు, బాసటగా నిలుస్తామని భరోసా.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 17 Aug 2026 2:04 PM IST
Talakondapally
X

Talakondapally: అంతారంలో మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ ఆర్థిక సాయం

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన కావలి రాములు గారు అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరం.

ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాసరెడ్డి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన కాసు శ్రీనివాసరెడ్డి తన వంతు సహాయంగా రూ. 4,000/- ఆర్థిక సహాయాన్ని కార్యకర్తల చేతుల మీదుగా మృతుడి కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మహేష్, వాడాల నాగేష్, సత్యనారాయణ గౌడ్, వార్డు నెంబర్ జవాజ్ రామకొండ, బోరిగా ఆనందం, కావలి పాపయ్య, గొర్రె శీను, కావలి శేఖర్, బైరపాగ మార్కండేయ, బుడ్డ మహేష్, కావలి మల్లయ్య, కావలి శేఖర్, కావలి గణేష్, గజ్జల రాములు, కావలి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story