Velgonda: పలుగుతండా పాఠశాలలో నీటి వసతి కల్పించిన దాతలు
Velgonda: పలుగుతండా పాఠశాలలో విద్యార్థుల కోసం దాతలు రూ.20 వేలతో వాటర్ ట్యాంక్, మోటార్ ఏర్పాటు చేశారు. ఎంఈఓ రాంరెడ్డి, సర్పంచ్ రమేష్ నాయక్ ప్రారంభించారు.
Velgonda: పలుగుతండా పాఠశాలలో నీటి వసతి కల్పించిన దాతలు
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పలుగుతండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం నీటి వసతి కల్పించేందుకు గ్రామనికి చెందిన. వినోద్ భాస్కర్ తమ సొంత గా దాదాపు రూ.20,000/- ఖర్చు చేసి వాటర్ ట్యాంక్, పైప్లైన్, మోటారు ట్యాప్స్ను ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్ రమేష్ నాయక్ తో కలిసి ఎంఈఓ రాo రెడ్డి ప్రారంభించారు
సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉండేలా చేసిన ఈ సహకారం పాఠశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దాతలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆర్. అనితా పంతు నాయక్ దిశా కమిటీ సభ్యులు మొతిలాల్ నాయక్ గ్రామ వార్డు మెంబర్లు వెంకటయ్య శాంతి అంజ్య శారద శ్రీను నాయక్ ,దాతలు ధర్మ నాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పంతు నాయక్ ఉపాధ్యాయులు దేవేందర తో పాటు తదితరులు ఉన్నారు




