Nagarkurnool: వెల్దండలో మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుడి ఆర్థిక సాయం!
Nagarkurnool: వెల్దండలో మాడుగుల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య. ₹5 వేల ఆర్థిక సాయం అందజేసి భరోసా.
Nagarkurnool: వెల్దండలో మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుడి ఆర్థిక సాయం!
Nagarkurnool: వెల్దండ సెప్టెంబర్ 16 వెల్దండ మండల కేంద్రానికి చెందిన మాడుగుల సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లింగం మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్ ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్ మాజీ సర్పంచ్ గుద్దేటి ప్రభాకర్ వార్డు మెంబర్ సభ్యులు శేఖర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంజయ్య మంగళగిరి సత్యం మట్ట శ్రీనివాస్ గౌడ్ జంగిలి రవికుమార్ యువ నాయకులు జంగిలి తిరుపతయ్య టైలర్ వెంకటయ్య గోరేటి రాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




