Kautala: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో నదిలో పడి వ్యక్తి మృతి

Kautala: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి కొసరి రాందాస్ మృతి చెందారు.

SRINIVAS, KOUTALA
Published on: 27 Aug 2026 11:17 PM IST
Kautala
X

Kautala: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో నదిలో పడి వ్యక్తి మృతి

కౌటాల: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తాటిపల్లి గ్రామానికి చెందిన కొసరి రాందాస్ తాటిపల్లి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు.

సమాచారం అందుకున్న కౌటాల సీఐ సంతోష్ కుమార్, ఎస్‌ఐ సతీష్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బడిగే సంతోష్ సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు.

నదిలో మృతి చెందిన రాందాస్ మృతదేహాన్ని నది నుంచి బయటకు తీశారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సంతోష్ కుమార్ తెలిపారు

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story