Kannepalli: కన్నేపల్లిలో ఉద్రిక్తత.. తహసీల్దార్ కార్యాలయం కోసం ధర్నా!

Kannepalli: కన్నేపల్లి మండల కేంద్రంలోనే తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు బంద్, ధర్నా నిర్వహించారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 14 Aug 2026 5:47 PM IST
Kannepalli
X

Kannepalli: కన్నేపల్లిలో ఉద్రిక్తత.. తహసీల్దార్ కార్యాలయం కోసం ధర్నా!

కన్నేపల్లి: తహసీల్దార్ కార్యాలయాన్ని కన్నేపల్లి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కన్నేపల్లి గ్రామస్తులు శుక్రవారం బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కార్యాలయాన్ని కన్నేపల్లి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండేలా మండల కేంద్రంలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.

బంద్‌కు గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు, యువత, ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనంతరం కన్నేపల్లి ఎస్‌ఐ విక్రమ్ నిరసన కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని గ్రామస్తులను కోరారు. అయితే తహసీల్దార్ కార్యాలయం కన్నేపల్లి మండల కేంద్రంలోనే ఉండాలని గ్రామస్తులు స్పష్టం చేశారు. అనంతరం శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని ముగించారు.

అనంతరం గ్రామస్తులు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి, తహసీల్దార్ కార్యాలయాన్ని కన్నేపల్లి మండల కేంద్రంలోనే ఏర్ప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తామని తహసీల్దార్ తెలిపారు. అనంతరం గ్రామస్తులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story