Medak: నర్సాపూర్ పరిధిలో 96 శాతం పూర్తయిన ఓటర్ల ఎన్యూమరేషన్!

Medak: నియోజకవర్గాలలో 96% ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, పనులను త్వరగా డిజిటలైజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు.

NAGARAJ, MEDAK
Published on: 7 July 2026 3:41 PM IST
Medak
X

Medak: నర్సాపూర్ పరిధిలో 96 శాతం పూర్తయిన ఓటర్ల ఎన్యూమరేషన్!

మెదక్ జూలై 07: మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మెదక్ నర్సాపూర్ నియోజకవర్గాలలో 96% పంపిణీ పూర్తి చేయడం జరిగిందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో మెదక్ నర్సాపూర్ నియోజకవర్గాలలో . 4.53.140 ఓటర్లకు 436477 ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.ఎన్యూమరేషన్ ఫారాల ఓటర్లు పూర్తిగా నింపిన 43091 మంది ఓటర్లు తిరిగి బిఎల్ఓ కి ఇవ్వడం జరిగిందని.

అట్టి ఫారాలను ఆన్లైన్ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. జిల్లావ్యాప్తంగా 586 మంది బిఎల్వోలు పనిచేయడం జరుగుతుందని ప్రతి ఇంటికి మూడుసార్లు ఆ బి యల్ ఓ వెళ్లి వారం లను ఎంపిటి చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు నూతనంగా ఓటరు నమోదు చేసుకునే వ్యక్తులు ఫారం 6. ఓటర్ను మార్చుకునే ఓటర్లు ఫారం 8 ను పూర్తి చేయాలని. జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో బిఎల్వోలు పంపిణీ పూర్తైన ఫారాలను వెంటనే డిజిటలైజ్ చేసి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story