Narsapur: కల్తీ పాల ముఠా గుట్టురట్టు.. టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 15 July 2026 9:23 AM IST
Narsapur
X

Narsapur: కల్తీ పాల ముఠా గుట్టురట్టు.. టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కల్తీ పాల తయారీ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో శివన్నగారి సుధాకర్ గౌడ్ కృత్రిమ పాలను తయారు చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

దాడుల సందర్భంగా నిందితుడి వద్ద నుంచి సుమారు 150 లీటర్ల కల్తీ పాలు, పెద్ద మొత్తంలో మిల్క్ పౌడర్, పాలు తయారీలో ఉపయోగిస్తున్న రసాయన పదార్థాలు, మిక్సింగ్ సామగ్రి, ఇతర తయారీ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఈ కల్తీ పాలను ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? ఎంతకాలంగా ఈ అక్రమ దందా కొనసాగుతోంది? అనే కోణాల్లో టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

కల్తీ పాలు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉండటంతో, ఈ ఘటనపై అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల పాత్ర, సరఫరా నెట్‌వర్క్‌పై సమగ్ర సమాచారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, ఆహార పదార్థాల్లో కల్తీపై అధికారులు మరింత కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story