Narsapur: రహదారి నిధుల కోసం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాదయాత్ర

Narsapur: వెల్దుర్తి శెట్టిపల్లి మెదక్ రహదారి రీబీటీ పనులకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాదయాత్ర.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 31 Aug 2026 9:01 AM IST
Narsapur
X

Narsapur: రహదారి నిధుల కోసం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాదయాత్ర

Narsapur: వెల్దుర్తి నుంచి పిల్లికొట్టాల, శెట్టిపల్లి మీదుగా మెదక్ వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సోమవారం పాదయాత్ర చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు వెల్దుర్తి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.

ఈ ప్రధాన రహదారి ప్రస్తుతం అధ్వానంగా మారడంతో నిత్యం ప్రయాణించే ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రహదారికి రీబీటీ పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో రూ.18 కోట్లు మంజూరు. ఈ రహదారి రీబీటీ పనుల కోసం గత ప్రభుత్వ హయాంలో రూ.18 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. నిధులు మంజూరు కావడంతో పాటు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని, సంబంధిత పనులకు అగ్రిమెంట్ సైతం జరిగినట్లు పేర్కొన్నారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ పనులను రద్దు చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. రహదారి సమస్యను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదని తెలిపారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పాదయాత్ర ప్రధాన రహదారి అభివృద్ధికి తిరిగి నిధులు మంజూరు చేయడంతో పాటు రీబీటీ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

వెల్దుర్తి నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర పిల్లికొట్టాల, శెట్టిపల్లి మీదుగా కొనసాగనుంది. రహదారి సమస్యను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లి నిధులు సాధించడమే లక్ష్యంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రీబీటీ పనులకు నిధులు ఇవ్వాలని డిమాండ్

వెల్దుర్తి–పిల్లికొట్టాల–శెట్టిపల్లి–మెదక్ ప్రధాన రహదారి ప్రజలకు ఎంతో కీలకమైందని, దీనికి వెంటనే రీబీటీ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story