Siddipet: సెప్టెంబర్ 1న PRTU TS ‘మహాధర్నా’ సిద్దిపేటలో ఉపాధ్యాయ నేతల పిలుపు!

Siddipet: సెప్టెంబర్ 1న నిర్వహించే PRTU TS మహాధర్నాను విజయవంతం చేయాలని తొగుట మండల అధ్యక్షుడు పుల్లగూర్ల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 28 Aug 2026 8:55 AM IST
Siddipet
X

Siddipet: సెప్టెంబర్ 1న PRTU TS ‘మహాధర్నా’ సిద్దిపేటలో ఉపాధ్యాయ నేతల పిలుపు!

Siddipet: సెప్టెంబర్ 1న PRTU TS ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వారి న్యాయమైన డిమాండ్లపై మాట్లాడుతున్న సిద్దిపేట జిల్లాతొగుట మండల PRTU TS అధ్యక్షులు పుల్లగూర్ల రామచంద్రారెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ముఖ్యంగా CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2003 DSC ఉపాధ్యాయులకు పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న PRCని వెంటనే ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని, సెప్టెంబర్ 1 మహాధర్నాను విజయవంతం చేయడానికి ప్రతి ఉపాధ్యాయుడు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల ఐక్యతే తమ సమస్యల పరిష్కారానికి ప్రధాన బలమని ఆయన పేర్కొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story