Baahubali: ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు రాజమౌళి ‘బాహుబలి’ యానిమేషన్ మూవీ!

Baahubali: ‘బాహుబలి’ రాజమౌళి తెరకెక్కించిన ఈ టూ-పార్ట్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఇండియన్ సినిమా మేకింగ్ స్టాండర్డ్స్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది.

Srinivas Rao
Published on: 18 Jun 2026 7:28 PM IST
Baahubali
X

Baahubali: ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు రాజమౌళి ‘బాహుబలి’ యానిమేషన్ మూవీ!

Baahubali: భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దృశ్యకావ్యం ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ టూ-పార్ట్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఇండియన్ సినిమా మేకింగ్ స్టాండర్డ్స్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలతో సంచలనాలు సృష్టించిన ఈ బ్రాండ్.. ఇప్పుడు యానిమేషన్ ప్రపంచంలోకి అడుగుపెడుతూ ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్ రూపంలో మరింత విస్తరిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ లెవెల్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకుంది.

ఫ్రాన్స్‌ యానిమేషన్ ఫెస్టివల్‌లో రాజమౌళి సంచలనం!

ఫ్రాన్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేయడానికి ఎస్.ఎస్. రాజమౌళి స్వయంగా హాజరవుతున్నారు. ఈ ఫెస్టివల్‌లో ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’విభాగం కింద ఈ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఈ ప్యానెల్ డిస్కషన్‌కు సంబంధించిన టికెట్లు బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం రెండు నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడైపోవడం గమనార్హం. దీన్ని బట్టి అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌పై ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

‘స్పైడర్-మ్యాన్’, ‘ఫ్లో’ చిత్రాల సరసన ‘బాహుబలి’!

ఈ ఘనత అంత తేలికైనదేమీ కాదు. గతంలో ఆస్కార్ గెలుచుకున్న ‘స్పైడర్-మ్యాన్: ఇంటు ది స్పైడర్-వర్స్’,2025 ఆస్కార్ విజేత ‘ఫ్లో వంటి ప్రపంచ ప్రసిద్ధ యానిమేషన్ చిత్రాలు కూడా ఇదే ఆన్సీ ఫెస్టివల్‌లో ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగంలో ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు ఆ లీగ్‌లోకి ప్రవేశించిన అతికొద్ది భారతీయ యానిమేషన్ ప్రాజెక్ట్‌లలో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ఒకటిగా నిలిచి చరిత్ర సృష్టించింది.

రెండు భాగాలుగా యానిమేషన్ ఎపిక్.. 2027లో రిలీజ్!

ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అఫీషియల్ టీజర్ అంతర్జాతీయంగా యానిమేషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్ ఈషాన్ శుక్లా ఈ టూ-పార్ట్ యానిమేషన్ ఎపిక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ట్రెడిషనల్ యానిమేషన్, సీజీఐ , క్లేమేషన్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో ఈ విజువల్ వండర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోని మొదటి భాగం 2027లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెండితెరపైనే కాకుండా యానిమేషన్ రంగంలోనూ ‘బాహుబలి’ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story