‘ది ఇండియా స్టోరీ’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. లాయర్‌గా కాజల్ అగర్వాల్ సర్‌ప్రైజ్!

The India Story: జీ స్టూడియోస్, ఎమ్‌ఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా అందిస్తున్న మోస్ట్ అవేటెడ్ ‘ది ఇండియా స్టోరీ’ అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

Srinivas Rao
Published on: 18 Jun 2026 4:22 PM IST
The India Story
X

‘ది ఇండియా స్టోరీ’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. లాయర్‌గా కాజల్ అగర్వాల్ సర్‌ప్రైజ్!

The India Story: జీ స్టూడియోస్, ఎమ్‌ఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా అందిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషల్ డ్రామా ‘ది ఇండియా స్టోరీ’ అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సమాజంలో ప్రతి ఒక్కరినీ భయపెడుతున్న ఒక సున్నితమైన సమస్యను చర్చిస్తూ వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్స్ ఆసక్తిని పెంచగా.. తాజాగా విడుదలైన మెయిన్ పోస్టర్ సినిమా కథాంశంపై మరింత స్పష్టతనిచ్చింది. ఈ చిత్రం జూలై 24, 2026న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

లాయర్‌గా కాజల్ అగర్వాల్..

ఈ పోస్టర్‌లో చందమామ కాజల్ అగర్వాల్ కోర్టు రూమ్‌లో నిలబడి ఒక పవర్‌ఫుల్, పట్టుదల కలిగిన లాయర్ లుక్‌లో కనిపిస్తుండగా.. శ్రేయస్ తల్పాడే తన కుమార్తె కోసం తపిస్తున్న ఒక నిస్సహాయుడైన, ఆందోళన కలిగిన తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఒక చిన్నారి ఫోటో ఈ పోస్టర్‌లో హైలైట్ అవ్వడం చూస్తుంటే.. ఆహార కల్తీ కారణంగా లక్షలాది కుటుంబాలు చెల్లిస్తున్న భారీ మానవ ప్రాణ నష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారని అర్థమవుతోంది.

బాంబే హైకోర్టు.. విట్నెస్ బాక్స్‌లో పెస్టిసైడ్ సిలిండర్!

పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌ను గమనిస్తే.. బాంబే హైకోర్టు నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ కోర్టు రూమ్ డ్రామా అని స్పష్టమవుతోంది. ముఖ్యంగా బోనులో పెస్టిసైడ్ సిలిండర్‌ను ఉంచడం ద్వారా.. మనం ప్రతిరోజూ తినే ఆహారంలో విషం ఎలా కలుస్తుందనే నగ్న సత్యాన్ని మేకర్స్ గట్టిగా చూపించబోతున్నారు. చేతన్ డీకే ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించగా.. సాగర్ బి నిర్మించారు.

‘ఇది ప్రతి భారతీయుడి కథ’.. దర్శకుడు చేతన్ డీకే సంచలన వ్యాఖ్యలు!

పోస్టర్ విడుదలైన సందర్భంగా దర్శకుడు చేతన్ డీకే మాట్లాడుతూ.. "ది ఇండియా స్టోరీ అనేది మన సమాజంలో తీవ్రంగా నిర్లక్ష్యం చేయబడుతున్న 'ఆహార కల్తీ' నేపథ్యంలో రూపొందిన చిత్రం. కల్తీ ఆహారం వల్ల బాధితులుగా మారిన ప్రతి భారతీయుడి కథ ఇది. మనం రోజూ తినే ఆహారంలో దాగున్న ప్రమాదకరమైన నిజాలను బయటపెట్టి, ప్రజల్లో అవగాహన పెంచడానికే ఈ సినిమా తీశాం. కచ్చితంగా ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ తాము తినే ఆహారంపై మరింత అప్రమత్తంగా ఉంటారు" అని ధీమా వ్యక్తం చేశారు.

టాప్ టెక్నీషియన్స్ కొల్లాబరేషన్

స్వాతి వినాయక్ సైందానే, అనిత జాదవ్, వినాయక్ సైదాని, కల్పేష్ షా, దేవియాని ఖోరతే, ప్రేమ్ జోషి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నిశాంత్ భాగవత్ డీఓపీగా, మంగేష్ ధాక్డే సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఆశిష్ మ్హాత్రే ఎడిటింగ్ బాధ్యతలు చూస్తుండగా.. షకీల్ అజామి లిరిక్స్, అన్మోల్ భావే సౌండ్ డిజైన్ అందిస్తున్నారు. ఒక సామాజిక బాధ్యతతో వస్తున్న ఈ కోర్టు రూమ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story