క్రేజీ ప్లాన్.. నవీన్ పోలిశెట్టి రూ. 5000 కోట్ల రీల్
Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి అంటేనే విభిన్నమైన ప్రమోషన్లు.
క్రేజీ ప్లాన్.. నవీన్ పోలిశెట్టి రూ. 5000 కోట్ల రీల్
నవీన్ పోలిశెట్టి అంటేనే విభిన్నమైన ప్రమోషన్లు. సినిమా షూటింగ్ మొదలుకాకముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో ఆయన తర్వాతే ఎవరైనా. తాజాగా నవీన్ తన కొత్త సినిమా ప్రమోషన్లను తనదైన శైలిలో మొదలుపెట్టారు. ఈసారి ఏకంగా ఇండియన్ సినిమాలోని టాప్ దర్శకులందరినీ ఒక్కచోటకు చేర్చి ఆయన చేసిన ఒక ఫన్నీ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
ఆ ‘రూ. 5000 కోట్ల’ ఫ్రేమ్ ఇదే!
ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, సుకుమార్ , రిషబ్ శెట్టి వంటి అగ్ర దర్శకులను ఒకే ఫ్రేమ్లోకి తీసుకురావడం అంటే సాధారణ విషయం కాదు. నవీన్ పోలిశెట్టి తన మార్క్ విట్తో ఈ దర్శకులందరినీ కలిపి, వారి చిత్రాల బాక్సాఫీస్ వసూళ్లను లెక్కగట్టి దీనిని ‘రూ. 5000 కోట్ల ఫ్రేమ్’ అని పిలిచారు. ఇది తన కెరీర్లోనే అత్యంత 'కాస్ట్లీయెస్ట్' రీల్ అని ఆయన పేర్కొనడం, నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.
ప్రాజెక్ట్ విశేషాలు
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పట్ల సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఇది పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా రూపొందబోతోందని సమాచారం. దర్శకుడు ఎవరనేది , ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
నవీన్ పోలిశెట్టి ఎంచుకున్న ఈ వినూత్న ప్రమోషన్ పద్ధతి, సినిమాపై హైప్ను అమాంతం పెంచేసింది. తనదైన టైమింగ్తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ నయా ప్రాజెక్ట్ కోసం నవీన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.




