Maa Inti Bangaaram 2: మా ఇంటి బంగారం సీక్వెల్ కన్ఫర్మ్
Maa Inti Bangaaram 2: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ చిత్రం 'మా ఇంటి బంగారం' అనూహ్యమైన విజయాన్ని నమోదు చేసుకుంది.
Maa Inti Bangaaram 2: మా ఇంటి బంగారం సీక్వెల్ కన్ఫర్మ్
Maa Inti Bangaaram 2: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ చిత్రం 'మా ఇంటి బంగారం' అనూహ్యమైన విజయాన్ని నమోదు చేసుకుంది. దర్శకురాలు నందిని రెడ్డి ప్రతిభ, సమంత అద్భుతమైన నటన ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చాయి. విడుదలైన మొదటి రోజు నుండే ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ను సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్రబృందం వైజాగ్లో ఒక భారీ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో వైజాగ్ నగరం సందడిగా మారింది.
రెండేళ్లలో సీక్వెల్ వచ్చేస్తోంది!
సక్సెస్ మీట్ వేదికపై ఈ సినిమా రచయిత, సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాకు సీక్వెల్ కావాలా? అని ఆయన ప్రేక్షకులను అడిగినప్పుడు, అభిమానుల నుండి వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. వారి ఉత్సాహాన్ని చూసి, రాజ్ నిడిమోరు 'మా ఇంటి బంగారం' రెండవ భాగం రాబోతోందని అధికారికంగా ప్రకటించారు.
రెట్టింపు వినోదంతో..
ఈ సందర్భంగా రాజ్ నిడిమోరు మాట్లాడుతూ, "నా మనసులో ఇప్పటికే ఒక ఆలోచన ఉంది. మొదటి భాగం రూపొందించిన అదే బృందం రెండవ భాగం కోసం కూడా పనిచేస్తుంది. నా సినీ కెరీర్లో ఒక చిత్రానికి కొనసాగింపు చేయాలని నాకు ఇంతగా అనిపించడం ఇదే మొదటిసారి. ఈ రెండో భాగం ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని, రెట్టింపు ఉత్సాహాన్ని అందిస్తుంది. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాను" అని ఆయన పేర్కొన్నారు.
ఈ సీక్వెల్ ప్రకటనతో చిత్రబృందం , అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది. సమంత మరోసారి తనదైన నటనతో అలరించడానికి సిద్ధమవుతుండటంతో, ఈ సినిమాపై ఇప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. రాజ్ నిడిమోరు , నందిని రెడ్డి కాంబినేషన్లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.




