రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు షాక్.. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపునకు హైకోర్టు నో!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ టికెట్ ధరలకు సంబంధించి సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది.
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు షాక్.. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపునకు హైకోర్టు నో!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ టికెట్ ధరలకు సంబంధించి సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తెలంగాణ (నైజాం) ప్రాంతంలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి లభించే అవకాశం లేదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
హైకోర్టును ఆశ్రయించినా దక్కని ఉపశమనం
చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని తొలుత ప్రభుత్వ హోమ్ సెక్రటరీని రెండుసార్లు సంప్రదించినట్లు సమాచారం. అయితే, అక్కడ నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో, చిత్ర బృందం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం, గతంలో టికెట్ ధరల పెంపుపై ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. కోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న చిత్ర యూనిట్, తమ పిటిషన్ను ఉపసంహరించుకుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
సాధారణ ధరలకే రామ్ చరణ్ సినిమా
కోర్టు నిర్ణయంతో ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ నైజాం ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న సాధారణ (స్టాండర్డ్) ప్రభుత్వ ధరలకే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే ఇదే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కూడా తెలంగాణలో ఎలాంటి అదనపు ధరలు లేకుండా సాధారణ రేట్లకే విడుదలైంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కూడా అదే బాటలో నడవనుండటంతో సాధారణ ప్రేక్షకులకు, మెగా అభిమానులకు ఇది ఒక రకంగా ఊరట కలిగించే విషయమే అని చెప్పాలి.




