Suriya: ‘కరుప్పు’ సీక్వెల్పై సూర్య సంచలన వ్యాఖ్యలు!
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గ్లామర్ క్వీన్ త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమా సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్ల జాబితాలో చేరిపోయింది.
Suriya: ‘కరుప్పు’ సీక్వెల్పై సూర్య సంచలన వ్యాఖ్యలు!
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గ్లామర్ క్వీన్ త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’). వైవిధ్యభరితమైన నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్ల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం అద్భుత విజయ సాధించిన నేపథ్యంలో, తాజాగా చిత్రబృందం గ్రాండ్గా సక్సెస్ మీట్ను నిర్వహించింది. ఈ వేదికపై హీరో సూర్య ఈ చిత్ర సీక్వెల్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.
గంటలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను
సక్సెస్ మీట్లో హీరో సూర్య మాట్లాడుతూ సినిమా విజయంపై తన ఆనందాన్ని పంచుకున్నారు. “దర్శకుడు ఆర్జే బాలాజీ చెప్పిన కథ, ఆయన విజన్ను నేను పూర్తిగా నమ్మాను. కథ విన్న కేవలం గంట లోపే ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఈ సినిమా కోసం సంతకం చేసిన మొదటిరోజు నుంచే అంతా మంచే జరుగుతూ వచ్చింది. ‘కరుప్పు’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నేను ముందే ఊహించాను. కానీ, బాక్సాఫీస్ వద్ద ఇంత భారీస్థాయిలో మా అంచనాలకు మించి ఘన విజయాన్ని అందుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది” అని సూర్య పేర్కొన్నారు.
‘కరుప్పు’ సీక్వెల్పై సూర్య సంచలన హింట్
ఈ సక్సెస్ మీట్లో అభిమానులు, మీడియా ప్రతినిధులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కరుప్పు' సీక్వెల్ గురించి సూర్యను ప్రశ్నించారు. దీనికి ఆయన తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిస్తూ.. “కరుప్పు చిత్రానికి రెండో భాగం రావాలని నేను కూడా అంతే ఆశతో, ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దీనికి సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే వెల్లడవుతాయని నమ్ముతున్నాను” అని అన్నారు. సూర్య ఇచ్చిన ఈ సానుకూల హింట్తో ‘కరుప్పు 2’ త్వరలోనే పట్టాలెక్కడం ఖాయమని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
రూ.300 కోట్ల దిశగా బాక్సాఫీస్ కలెక్షన్లు
మే 15న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. సూర్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, త్రిష స్క్రీన్ ప్రెజెన్స్, ఆర్జే బాలాజీ అద్భుతమైన టేకింగ్ ఈ స్థాయి వసూళ్లకు కారణమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ భారీ కలెక్షన్లపై దర్శకుడు ఆర్జే బాలాజీ స్పందిస్తూ.. ఈ అద్భుత విజయం కేవలం దేవుడి దయ, ప్రేక్షకుల అపారమైన ప్రేమ వల్లే సాధ్యమైందని ఎమోషనల్ అయ్యారు. తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైన ఈ చిత్రం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ లాభాలను తెచ్చిపెడుతోంది.




