Yash: ముంబై బీచ్‌లో రాకీ భాయ్ అడ్డా.. 24 కోట్ల ప్రాపర్టీ కొన్న యశ్!

Yash: ‘కేజీఎఫ్’ (KGF) సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ సృష్టించిన కన్నడ సూపర్ స్టార్ యశ్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టారు.

Srinivas Rao
Published on: 5 Jun 2026 2:31 PM IST
Yash
X

Yash: ముంబై బీచ్‌లో రాకీ భాయ్ అడ్డా.. 24 కోట్ల ప్రాపర్టీ కొన్న యశ్!

Yash: ‘కేజీఎఫ్’ (KGF) సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ సృష్టించిన కన్నడ సూపర్ స్టార్ యశ్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, కోటీశ్వరులకు అత్యంత ఇష్టమైన లగ్జరీ సెకండ్-హోమ్ డెస్టినేషన్ అయిన మహారాష్ట్రలోని అలీబాగ్‌లో యశ్, ఆయన సతీమణి రాధికా పండిట్ ఒక ప్రీమియం బీచ్ ఫ్రంట్ ల్యాండ్‌ను కొనుగోలు చేశారు. ఈ డీల్ విలువ అక్షరాలా రూ. 24 కోట్లు అని జాతీయ మీడియా బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ 'లియాసెస్ ఫోరాస్' సేకరించిన అధికారిక డాక్యుమెంట్ల ప్రకారం.. ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ మే 18, 2026న అలీబాగ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో విజయవంతంగా పూర్తయింది.

సముద్రం ఒడ్డున లగ్జరీ ఎస్టేట్..

అలీబాగ్ తాలూకాలోని కామత్ గ్రామంలో ఉన్న రెండు ప్రక్కప్రక్కనే ఉన్న వ్యవసాయ భూములను కలిపి యశ్ దంపతులు కొనుగోలు చేశారు. ఈ ల్యాండ్ మొత్తం వైశాల్యం దాదాపు 5,289 చదరపు మీటర్లు (సుమారు అర హెక్టారు పైగా) కాగా, ఇందులో ఒక లగ్జరీ నివాస నిర్మాణం కూడా ఉంది. ఈ ఎస్టేట్‌కు తూర్పున విలేజ్ రోడ్డు, పడమర వైపు నేరుగా అరబిక్ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. అలాగే ఉత్తరం వైపు ఉన్న ఒక చిన్న సందు ఈ ప్రాపర్టీ నుండి నేరుగా బీచ్‌లోకి వెళ్లేందుకు దారితీస్తుంది. రూ. 24 కోట్ల విలువైన ఈ ల్యాండ్ కోసం యశ్ కేవలం స్టాంప్ డ్యూటీ కోసమే రూ. 1.44 కోట్లు చెల్లించగా, రూ. 60,000 రిజిస్ట్రేషన్ ఫీజు, రూ. 5,200 డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ ఛార్జీల రూపంలో చెల్లించారు.

షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీల పక్కనే మన ‘టాక్సిక్’ హీరో!

ముంబై గేట్‌వేగా పిలవబడే అలీబాగ్ కోస్టల్ ఏరియా అనేది బాలీవుడ్ స్టార్స్‌కు, సెలబ్రిటీలకు ఒక లగ్జరీ హాలిడే స్పాట్ కాగా, ఇప్పుడు మన 'టాక్సిక్' హీరో కూడా ఆ లీగ్‌లోకి చేరిపోయారు. ఇక్కడ ఇప్పటికే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు సముద్రానికి ఫేసింగ్ ఉన్న 'దేజా వు ఫార్మ్స్' ఉండగా, ఆయన కుమార్తె సుహానా ఖాన్ కూడా ఇక్కడే రూ. 12.91 కోట్ల ల్యాండ్ కొనుగోలు చేశారు. వీరితో పాటు దీపికా పదుకొణె - రణ్‌వీర్ సింగ్ జంటకు కిహిమ్ బీచ్ సమీపంలో రూ. 22 కోట్ల విలువైన 5BHK కోస్టల్ రిట్రీట్, విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులకు జిరాద్ ఏరియాలో 8 ఎకరాల లగ్జరీ ఎస్టేట్ , విల్లా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ వంటి స్టార్స్ సైతం ఇక్కడే భారీ పెట్టుబడులు పెట్టారు.

ప్రస్తుతం యశ్ ఫ్యామిలీ బెంగళూరులోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రెస్టీజ్ గోల్ఫ్‌షైర్’ డ్యూప్లెక్స్ విల్లాలో నివసిస్తున్నారు, దీని మార్కెట్ విలువ రూ. 6 కోట్ల నుండి రూ. 8 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇది కాకుండా కర్ణాటకలో కూడా వీరికి ఒక సొంత ఫార్మ్‌హౌస్ ఉంది. ఇప్పుడు ముంబై ప్రముఖుల అడ్డా అయిన అలీబాగ్‌లో ఇంత భారీ ప్రాపర్టీ కొనడం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం యశ్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో లీడ్ రోల్‌లో ‘టాక్సిక్’ అనే హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story