Chityala: తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. చిట్యాలలో అంతర్రాష్ట్ర దొంగ జైరాంరెడ్డి అరెస్ట్!
Chityala: చిట్యాలలో పగటిపూట ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అలుగుబెల్లి జైరాంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.22.10 లక్షల విలువైన బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.
Chityala: తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. చిట్యాలలో అంతర్రాష్ట్ర దొంగ జైరాంరెడ్డి అరెస్ట్!
నల్గొండ: పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అలుగుబెల్లి జైరాంరెడ్డిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.
నిందితుడి వద్ద నుంచి 12 తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలు, ₹2.50 లక్షల నగదుతో పాటు ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు ₹22.10 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు.
Next Story




