Nalgonda: సాగునీటి ప్రాజెక్టులపై సీఎంకు ఎంపీ రఘువీర్రెడ్డి వినతి
Nalgonda: నాగార్జునసాగర్, మిర్యాలగూడ పరిధిలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీఎంను కోరిన నల్గొండ ఎంపీ రఘువీర్రెడ్డి.
Nalgonda: సాగునీటి ప్రాజెక్టులపై సీఎంకు ఎంపీ రఘువీర్రెడ్డి వినతి
నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ లింకు కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్రెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న భూసేకరణ సమస్యలను, దిండి ప్రాజెక్టు భూసేకరణను పరిష్కరించాలన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలోని నాలుగు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి సహకరించాలని, చిన్న నియోజకవర్గాలపై దృష్టి సారించాలని సీఎంను కోరారు.
Next Story




