Nalgonda: నల్లగొండ ఎన్జీ కాలేజీ వద్ద మట్టి వినాయకుల పంపిణీ!

Nalgonda: నల్లగొండ ఎన్జీ కాలేజ్ వద్ద మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజించాలని డీఎస్పీ శివరాం రెడ్డి పిలుపు.

Saleem, Nalgonda
Published on: 13 Sept 2026 11:36 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ ఎన్జీ కాలేజీ వద్ద మట్టి వినాయకుల పంపిణీ!

Nalgonda: నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎన్జీ కాలేజ్) వద్ద మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని పిలుపునిచ్చారు. రసాయన రంగులతో కూడిన విగ్రహాల వల్ల జలాశయాలు కలుషితమవుతాయని, సహజసిద్ధమైన మట్టి గణపతులను పూజించడం ద్వారా నీటి కాలుష్యానికి అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు. వినాయక చవితి వేళ ఇటువంటి పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.

​ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్లారావుతో పాటు పలువురు స్థానిక ప్రముఖులు, పౌరులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda