Kanagal: కనగల్ మండలంలో 33/11 కేవీ సబ్స్టేషన్ను పరిశీలించిన మాజీ మంత్రి జగదీశ్రెడ్డి!
Kanagal: నల్గొండ జిల్లా కనగల్ మండలం తిమ్మన్నగూడెంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పరిశీలించారు.
Kanagal: కనగల్ మండలంలో 33/11 కేవీ సబ్స్టేషన్ను పరిశీలించిన మాజీ మంత్రి జగదీశ్రెడ్డి!
Kanagal: నల్గొండ జిల్లా కనగల్ మండలం తిమ్మన్నగూడెంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి ఆదివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ అమలువుతున్న విద్యుత్ సరఫరా తీరుపై అధికారులను, స్థానిక రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీటి పంపుసెట్లకు నిరంతరం, నాణ్యమైన విద్యుత్ను అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. లో-వోల్టేజీ సమస్యలు, తరచూ విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే సబ్స్టేషన్లలో సాంకేతిక లోపాలను సరిదిద్ది, రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉచిత విద్యుత్ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




