Nalgonda: హైదరాబాద్లో ఎఫ్పిఓ ప్రాముఖ్యతపై రాష్ట్ర స్థాయి సదస్సు!
Nalgonda: హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి FPO సదస్సుకు నల్గొండ పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, సీఈఓ అనంతరెడ్డి హాజరయ్యారు.
Nalgonda: హైదరాబాద్లో ఎఫ్పిఓ ప్రాముఖ్యతపై రాష్ట్ర స్థాయి సదస్సు!
Nalgonda: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPO) ప్రాముఖ్యత, అభివృద్ధిపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా ప్రతినిధులుగా నల్గొండ పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, సీఈఓ అనంతరెడ్డి హాజరయ్యారు.
వ్యవసాయ రంగంలో సహకార సంఘాల పాత్ర, రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మద్దతు ధర మరియు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, సబ్సిడీ పథకాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా చేరవేసేందుకు పీఏసీఎస్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని సమావేశంలో పిలుపునిచ్చారు.
Next Story




