Nalgonda: రాజ్యాధికారంతోనే మాదిగల విముక్తి వంగపల్లి శ్రీనివాస్
Nalgonda: నల్లగొండలో ఎమ్మార్పీఎస్ సమావేశం. 32 ఏళ్ల పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని, ఇకపై రాజ్యాధికారం కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని వంగపల్లి పిలుపు.
Nalgonda: రాజ్యాధికారంతోనే మాదిగల విముక్తి వంగపల్లి శ్రీనివాస్
నల్గొండ: రాజ్యాధికారంతోనే మాదిగల విముక్తి, సర్వాంగీణ అభివృద్ధి సాధ్యమని ఎమ్మార్పీఎస్-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర్కొన్నారు.
నల్లగొండలోని పిఆర్టీయు భవనంలో జిల్లా అధ్యక్షుడు మారపాక నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
32 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామని, ఈ విజయం మాదిగ అమరవీరులకే అంకితమని అన్నారు. రాజ్యాధికారం లేని సమూహాలు అంతరించిపోతాయని, ఇకపై అధికారంలో తగిన భాగస్వామ్యం సాధించేందుకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Next Story




