Amarnath Yatra Resume : మళ్లీ మొదలైన అమర్‌నాథ్ యాత్ర.!

Amarnath Yatra Resume : జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవేపై విరిగిపడిన భారీ ల్యాండ్‌స్లైడ్‌ను (కొండచరియలు) అధికారులు క్లియర్ చేయడంతో అమర్‌నాథ్ యాత్ర మళ్లీ రీస్టార్ట్

G Krishna
Published on: 26 July 2026 2:57 PM IST
amarnath-yatra
X

amarnath-yatra

Amarnath Yatra Resume : జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవేపై విరిగిపడిన భారీ ల్యాండ్‌స్లైడ్‌ను (కొండచరియలు) అధికారులు క్లియర్ చేయడంతో అమర్‌నాథ్ యాత్ర మళ్లీ రీస్టార్ట్ అయింది. జమ్మూ బేస్ క్యాంప్ నుంచి 4,474 మంది భక్తులతో కూడిన 19వ బ్యాచ్ ఆదివారం ఎర్లీ మార్నింగ్ కాశ్మీర్ లోయలోని బాల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరినట్లు ఆఫీసర్స్ వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బతినడంతో యాత్రకు కొంత బ్రేక్ పడగా, అధికారులు వెంటనే రంగంలోకి దిగి రూట్‌ను క్లియర్ చేశారు.

166 వెహికల్స్ కాన్వాయ్.. టైట్ సెక్యూరిటీ

జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన ఈ 19వ బ్యాచ్‌లో మొత్తం 166 వెహికల్స్ ఉన్నాయి. బస్సులు, మినీ బస్సులు , ప్రైవేట్ కార్లలో యాత్రికులు ప్రయాణిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్ , సీఆర్పీఎఫ్ (CRPF) టీమ్స్ పక్కా సెక్యూరిటీ మధ్య ఈ కాన్వాయ్ గాంధర్‌బల్ డిస్ట్రిక్ట్‌లోని బాల్తాల్ బేస్ క్యాంప్‌ వైపు బయలుదేరింది. అయితే అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ వైపు మాత్రం ప్రస్తుతం యాత్రికులను అనుమతించడం లేదు.

పహల్గామ్ రూట్‌లో రిపేర్స్.. బాల్తాల్ మార్గంలోనే యాత్ర

రీసెంట్ వర్షాల వల్ల పహల్గామ్ ట్రెడిషనల్ రూట్‌లో ట్రాక్ బాగా డ్యామేజ్ అయిందని, అక్కడ అర్జెంట్ రిపేర్ అండ్ మేంటేనెన్స్ వర్క్స్ జరుగుతున్నాయని కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ అంశుల్ గర్గ్ తెలిపారు. యాత్రికుల సేఫ్టీ తమకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ.. ప్రస్తుతానికి యాత్రను బాల్తాల్ రూట్ ద్వారా మాత్రమే కంటిన్యూ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అక్కడ భక్తులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని రకాల అరేంజ్‌మెంట్స్ చేశామన్నారు. అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే అడ్వైజరీలను, అలర్ట్‌లను భక్తులు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కోరారు.

గంగ్రూ వద్ద ల్యాండ్‌స్లైడ్.. కొన్ని గంటల్లోనే రోడ్డు ఓపెన్

రాంబన్ డిస్ట్రిక్ట్‌లోని రామ్‌సూ దగ్గర ఉన్న గంగ్రూ వద్ద శనివారం ఈవినింగ్ జమ్మూ-శ్రీనగర్ హైవేపై ఒక్కసారిగా పెద్ద ల్యాండ్‌స్లైడ్ అయింది. వర్షాల వల్ల మూడు రోజులుగా బంద్ అయిన రోడ్డును ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే మళ్లీ కొండచరియలు పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే రోడ్ రెస్టోరేషన్ టీమ్స్ వెంటనే హెవీ మెషినరీతో స్పాట్‌కి చేరుకుని కేవలం కొన్ని గంటల్లోనే డెబ్రిస్ (శిథిలాలు) క్లియర్ చేశారు. దాంతో ఆదివారం మార్నింగ్ నుంచి వెహికల్స్ మూవ్‌మెంట్ మళ్లీ నార్మల్ అయింది.

4 లక్షలు దాటిన దర్శనాలు

ఈ ఇయర్ 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర అమర్‌నాథ్ యాత్ర జూలై 3న స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర గుహలో 4 లక్షల మందికి పైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు ఆఫీసర్స్ చెప్పారు. ఈ యాన్యువల్ యాత్ర ఆగస్టు 28న రాఖీ పండగ (రక్షాబంధన్) రోజుతో కంప్లీట్ కానుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story