Arvind Kejriwal: ఈ20 పెట్రోల్ ధరలు తగ్గించాలి.. ఆగస్టు 4న ప్రధాని ఇంటికి కేజ్రీవాల్ పాదయాత్ర!
Arvind Kejriwal: ఈ20 ఇంధనం లేదా స్వచ్ఛమైన పెట్రోల్ను ఎంచుకునే స్వేచ్ఛను ప్రజలకు ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
Arvind Kejriwal: ఈ20 పెట్రోల్ ధరలు తగ్గించాలి.. ఆగస్టు 4న ప్రధాని ఇంటికి కేజ్రీవాల్ పాదయాత్ర!
Arvind Kejriwal: పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన ఈ20 (E20) ఇంధనం మరియు స్వచ్ఛమైన (ప్యూర్) పెట్రోల్లలో ఏదో ఒకదానిని ఎంచుకునే స్వేచ్ఛను వినియోగదారులకే కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఈ20 మిశ్రమ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ఈ20 ఇంధనానికి సంబంధించిన ప్రజా సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం ఇచ్చేందుకు ఆగస్టు 4న ప్రధాని నివాసం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు.
"భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగానే ప్రభుత్వం పౌరులపై బలవంతంగా ఈ20 ఇంధనాన్ని రుద్దుతోంది. దీని కారణంగా దేశంలోకి ఇథనాల్ దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. E20 ఇంధనం వల్ల వాహన ఇంజిన్లకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వం చెబుతున్న అధ్యయన నివేదికలను సభాముఖంగా బహిరంగపరచాలి." అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఈ20 ఇంధనం వాహనాలపై చూపుతున్న ప్రభావం మరియు దాని ధర తగ్గింపు అంశాలపై రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని ఆప్ నాయకత్వం స్పష్టం చేసింది.




