West Bengal: అసన్సోల్లో ఆధ్యాత్మిక వెలుగులు.. ఏళ్ల తర్వాత తెరుచుకున్న దుర్గా గుడి!
West Bengal: పశ్చిమ బెంగాల్ అసన్సోల్లో ఏళ్ల తర్వాత తెరుచుకున్న దుర్గా మాత ఆలయం. ఎన్నికల హామీని నెరవేర్చిన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ.
West Bengal: అసన్సోల్లో ఆధ్యాత్మిక వెలుగులు.. ఏళ్ల తర్వాత తెరుచుకున్న దుర్గా గుడి!
West Bengal: పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న రాజకీయ మార్పు మతపరమైన ఆచారాలపై కూడా తన ముద్ర వేస్తోంది. అసన్సోల్లోని బస్తీన్ బజార్ ప్రాంతంలో సంవత్సరాలుగా మూతపడి ఉన్న శ్రీ-శ్రీ దుర్గామాత ఛారిటబుల్ ట్రస్ట్ ఆలయం ఎట్టకేలకు భక్తుల కోసం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. రాజకీయ మార్పుతో వచ్చిన ఈ సామాజిక పరిణామం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.
పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడంతో అసన్సోల్ నార్త్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కృష్ణేందు ముఖర్జీ తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేశారు. గతంలో కేవలం దుర్గాపూజ, లక్ష్మీపూజ సమయాల్లో మాత్రమే తెరిచే ఈ ఆలయాన్ని, ఇకపై ఏడాది పొడవునా భక్తుల కోసం తెరిచి ఉంచాలని ఆయన నిర్ణయించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ స్వయంగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ద్వారాలను అధికారికంగా తెరిచారు. ఈ వార్త తెలియగానే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇది తమ విశ్వాసానికి దక్కిన విజయమని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయం నిరంతరం తెరిచి ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలు పెరగడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరగనుంది. భక్తుల రాకపోకలు పెరగడంతో చిన్న వ్యాపారాలు పుంజుకుంటాయని స్థానికులు ఆశిస్తున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమ డిమాండ్ నెరవేరడంతో బస్తీన్ బజార్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.




