Twisha Sharma: సీబీఐ చేతికి నటి త్విషా శర్మ మృతి కేసు.. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం..

Twisha Sharma: నటి త్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసును సీబీఐ (CBI) అధికారికంగా చేతుల్లోకి తీసుకుంది.

Arun Chilukuri
Published on: 25 May 2026 5:09 PM IST
Twisha Sharma
X

Twisha Sharma: సీబీఐ చేతికి నటి త్విషా శర్మ మృతి కేసు.. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం..

Twisha Sharma: అనుమానాస్పదంగా మృతి చెందిన నటి త్విషా శర్మ కేసు సీబీఐ హ్యాండోవర్ చేసుకుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పోలీసుల విచారణపై అనుమానాలు వ్యక్తం అయిన నేపథ్యంలో సీబీఐ విచారణ చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని విచారణకు సిద్ధమైంది. ఇవాళ భోపాల్‌కు చేరుకోనున్న విచారణ బృందం.. త్విషా గదిని పరిశీలింనుంది.

ఇక త్విషా కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేసును సీబీఐకి అప్పగించడాన్ని సమర్థించింది. విచారణపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. సీబీఐకి కేసు అప్పగించడం సరైన నిర్ణయమని తెలిపింది. సీబీఐ వెంటనే విచారణ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదే‎శించింది.

మరోవైపు త్విషా భర్త లాయర్ కావడంతో.. కేసు విచారణలో కోర్టులు జోక్యం చేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. దీనిపై సీజేఐ స్పందించారు. కోర్టు విచారణను తప్పుదోవ పట్టించిందంటూ ఆరోపణలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విచారణలో కోర్టుల ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story