Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ఊహించని మలుపు.. సీఎం సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించిన డీకే శివకుమార్!
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం. సీఎం సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ఊహించని మలుపు.. సీఎం సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించిన డీకే శివకుమార్!
Karnataka: కర్ణాటక రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో నాయకత్వ మార్పు (CM Change) జరగబోతోందనే ఊహాగానాలు గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతున్న వేళ, గురువారం ఉదయం బెంగళూరులో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన క్యాబినెట్ మంత్రుల కోసం అధికారిక నివాసంలో అల్పాహార విందు (Breakfast Meeting) ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అందరినీ ఆశ్చర్యపరిచే దృశ్యం ఒకటి కనిపించింది.
ఈ విందుకు హాజరైన ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్.. అందరూ చూస్తుండగానే సీఎం సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు నవ్వుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కర్ణాటకలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం.. సిద్ధరామయ్య త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నారని, ఆ తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం ఖాయమనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ ఉత్కంఠ భరిత పరిణామాల మధ్యే సిద్ధరామయ్య విందు ఇవ్వడం, దానికి డీకే శివకుమార్ హాజరై పాదాభివందనం చేయడం చూస్తుంటే.. రాష్ట్రంలో అధికార మార్పిడికి లైన్ క్లియర్ అయిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.




