Mumbai: ముంబై వాసులకు భారీ షాక్.. ఒకేరోజు పెరిగిన పాలు, సీఎన్జీ, ఆటో-ట్యాక్సీ ఛార్జీలు!
Mumbai: ముంబైలో సెప్టెంబర్ 1 నుంచి పాలు, సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్తో పాటు ఆటో, ట్యాక్సీ ఛార్జీలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులపై తీవ్ర భారం పడింది.
Mumbai: ముంబై వాసులకు భారీ షాక్.. ఒకేరోజు పెరిగిన పాలు, సీఎన్జీ, ఆటో-ట్యాక్సీ ఛార్జీలు!
Mumbai: సెప్టెంబర్ 1వ తేదీ ముంబై ప్రజలకు ఆర్థికంగా భారంగా మొదలైంది. నగరంలో అత్యంత కీలకమైన నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యుడి జేబుపై పెనుభారం పడింది. పాలు, ఇంధనం (సీఎన్జీ, పీఎన్జీ), స్థానిక రవాణా (ఆటో, ట్యాక్సీ) ఛార్జీలు ఒకేరోజు పెరగడంతో నగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (ఎంజీఎల్) సీఎన్జీ ధరను కేజీకి రూ. 2 పెంచడంతో కొత్త ధర రూ. 88కి చేరింది. అలాగే గృహావసరాల పీఎన్జీ ధర కూడా ఎస్సీఎంకు రూ. 1 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలే దీనికి కారణమని సంస్థ తెలిపింది. ఈ పెంపుతో సుమారు 13 లక్షల సీఎన్జీ వాహనదారులు, 30 లక్షల పీఎన్జీ వినియోగదారులపై ప్రభావం పడనుంది.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎంఎంఆర్టీఏ) ఆటో, ట్యాక్సీ ఛార్జీల పెంపునకు ఆమోదం తెలిపింది. తాజా పెంపుతో ఆటో కనీస ఛార్జీ రూ. 27కి, ట్యాక్సీ కనీస ఛార్జీ రూ. 33కి పెరిగాయి. నవంబర్ చివరి నాటికి మీటర్లను రీకాలిబ్రేట్ చేయాలని అధికారులు ఆదేశించారు.
టబేలా పాల ధర లీటర్కు ఏకంగా రూ. 9 పెరిగి రూ. 102కి చేరింది. పశువుల దాణా ధరలు పెరగడమే ఇందుకు కారణమని ఉత్పత్తిదారులు పేర్కొన్నారు. ఉదయం తాగే పాల నుంచి ప్రయాణాల వరకు అన్నింటి ధరలు పెరగడంతో ముంబై ప్రజల నెలవారీ బడ్జెట్ తలకిందులైంది.




