NEET: నీట్ పేపర్ లీకేజీలకు చెక్.. క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం ఇక అసాధ్యమన్న కేంద్రం!
NEET: నీట్ పరీక్షల భద్రతపై సుప్రీం కోర్టులో కేంద్రం వివరణ ఇచ్చింది. రాధాకృష్ణన్, నందన్ నీలేకని కమిటీల సిఫార్సులపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
NEET: నీట్ పేపర్ లీకేజీలకు చెక్.. క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం ఇక అసాధ్యమన్న కేంద్రం!
NEET: నీట్ (NEET UG) పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ (NTA) సుప్రీం కోర్టుకు కీలక వివరాలను వెల్లడించాయి. వైద్య విద్య ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత పకడ్బందీ విధానాలను అమలు చేస్తున్నామని, వీటిని ఛేదించడం అసాధ్యమని అత్యున్నత న్యాయస్థానానికి వివరించాయి.
నిపుణులు ఉమ్మడిగా క్వశ్చన్ బ్యాంక్ను తయారు చేస్తారని, అందులో నుంచి తుది పరీక్షా పత్రంలో ఏ ప్రశ్నలు వస్తాయనేది వారికి కూడా తెలియని విధంగా గోప్యత పాటిస్తున్నామని తెలిపింది. ప్రశ్నపత్రాల రవాణా వాహనాలకు జీపీఎస్ (GPS) వ్యవస్థలను అమర్చామని, అవి ప్రతి చిన్న కదలికను రికార్డ్ చేస్తూ నిరంతరం అధికారుల పర్యవేక్షణలో ఉంటాయని స్పష్టం చేసింది. సైబర్ భద్రత కోసం ఇంటర్నెట్తో సంబంధం లేని 'ఎయిర్-గ్యాప్డ్ సిస్టమ్స్' మరియు సీక్రెట్ రూమ్లలో ప్రశ్నపత్రాల భద్రతా విధానాలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఎన్టీఏ పేర్కొంది.
పేపర్ లీకేజీల నివారణకు సంస్థాగత మార్పులు అవసరమని పేర్కొన్న రాధాకృష్ణన్ కమిటీ అభిప్రాయంతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. నీట్ పరీక్షల సంస్కరణలపై రాధాకృష్ణన్ ప్యానెల్ మరియు నందన్ నీలేకని కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని జాతీయ పరీక్షల సంస్థను ధర్మాసనం ఆదేశించింది.
పరీక్షల వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా ఎన్టీఏ ఇప్పటికే 50 మందికి పైగా సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, క్వశ్చన్ పేపర్ డిజైనింగ్ తదితర విభాగాంశాల కోసం ప్రైవేట్ రంగానికి చెందిన నిపుణులను కూడా భాగస్వామ్యం చేస్తున్నట్లు వెల్లడించింది.




