Ayodhya: అయోధ్య రామాలయం ట్రస్ట్ సీఈఓ పోస్టుకు భారీ రెస్పాన్స్.. వెయ్యికి పైగా దరఖాస్తులు!
Ayodhya: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈఓ పోస్టుకు భారీ డిమాండ్ నెలకొంది.
Ayodhya: అయోధ్య రామాలయం ట్రస్ట్ సీఈఓ పోస్టుకు భారీ రెస్పాన్స్.. వెయ్యికి పైగా దరఖాస్తులు!
Ayodhya: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చరిత్రలో మొదటిసారిగా నియమించబోతున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పోస్టుకు భారీ స్పందన లభించింది. ఈ పదవి కోసం ఇప్పటివరకు 1,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రామాలయ విరాళాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఆలయ రోజువారీ నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుకు పోటీ పడుతున్న వారిలో రాజకీయ నేపథ్యం ఉన్నవారు, మాజీ బ్యూరోక్రాట్లు (ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు), వివిధ రంగాల ప్రముఖ నిపుణులు ఉన్నారు.
కీలకమైన అర్హతలు & నిబంధనలు ఇవే:
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 50 నుండి 70 ఏళ్ల మధ్య ఉండాలి.
అనుభవం: పెద్ద ప్రభుత్వ సంస్థలు లేదా పబ్లిక్ ఆర్గనైజేషన్లలో కనీసం 20 ఏళ్ల మేనేజీరియల్ అనుభవం తప్పనిసరి.
ప్రత్యేక నిబంధన: అభ్యర్థి తప్పనిసరిగా హిందూ ధర్మాన్ని ఆచరించేవాడై ఉండాలి. శ్రీరాముని భక్తుడై ఉండటంతో పాటు, వైష్ణవ సాంప్రదాయానికి చెందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
భాషా నైపుణ్యం: హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు ఉండాలి. ఆలయాల నిర్వహణ అనుభవం ఉన్న విశ్రాంత అధికారులకు ప్రాధాన్యత ఇస్తారు.
జూలై 22న తుది నిర్ణయం:
ట్రస్ట్ జూలై 13న దరఖాస్తులను ఆహ్వానించగా, జూలై 18ని చివరి తేదీగా నిర్ణయించింది. వచ్చిన దరఖాస్తుల పరిశీలన (Screening) జూలై 19 నుండి ప్రారంభం కానుంది. ఈ ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించడానికి రిటైర్డ్ జడ్జ్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, ట్రస్టీ సురేష్ హవారేలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. జూలై 22న జరిగే ట్రస్ట్ సమావేశంలో సీఈఓ నియామకంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపికైన అభ్యర్థి మూడేళ్ల కాలపరిమితితో అయోధ్య కేంద్రంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.




