PM Modi: రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ!
PM Modi: మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన తర్వాత ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? నేడు రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం.
PM Modi: రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ!
PM Modi: దేశ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేడు (శనివారం) రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం (PMO) అధికారికంగా ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ల కోసం కేంద్రం ప్రతిపాదించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన తర్వాతి రోజే ప్రధాని ప్రసంగం ఉండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఏ అంశంపై ప్రసంగం?
ప్రధాని ప్రసంగం ప్రధానంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు చుట్టూ ఉండబోతున్నట్లు సమాచారం. శుక్రవారం లోక్సభలో జరిగిన ఓటింగ్లో ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చినా, రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో బిల్లు ఆగిపోయింది. దీనిపై ప్రధాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ చారిత్రక తప్పిదానికి ప్రతిపక్షాలు భారీ మూల్యం చెల్లించుకుంటాయని ఇప్పటికే ఆయన కేబినెట్ భేటీలో హెచ్చరించారు.
రాజకీయ ప్రకంపనలు:
ప్రతిపక్ష పార్టీలు మహిళా వ్యతిరేకమనే విషయాన్ని ఈ ప్రసంగం ద్వారా ప్రధాని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ బిల్లు అమలు కోసం కేంద్రం తీసుకోబోయే తదుపరి చర్యలపై లేదా ఏదైనా సంచలన నిర్ణయంపై ఆయన స్పష్టత ఇవ్వవచ్చని భావిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు మరియు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రధాని ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.




