Rahul Gandhi: గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. ఆదివాసీల హక్కులు ఏమవ్వాలి?
Great Nicobar: గ్రేట్ నికోబార్ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయడంపై రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కులు, పర్యావరణ రక్షణ కోసం ఆయన చేసిన వ్యాఖ్యల పూర్తి వివరాలు.
Rahul Gandhi: గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. ఆదివాసీల హక్కులు ఏమవ్వాలి?
Great Nicobar: అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో అక్కడి అపురూపమైన సహజ సంపదను, ఆదివాసీల ఉనికిని ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మెగా ప్రాజెక్ట్ కారణంగా సుమారు 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని శతాబ్దాల నాటి వర్షారణ్యాలు (Rainforests) కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రాహుల్ పేర్కొన్నారు. "వేల ఏళ్లుగా ప్రకృతిని కాపాడుకుంటూ వస్తున్న అరణ్యాలు, వృక్ష సంపద నేడు ప్రమాదంలో పడ్డాయి. ఇది అభివృద్ధి కాదు, దేశ సహజ సంపదను నాశనం చేయడమే" అని ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
ఈ భారీ ప్రాజెక్టు వల్ల కేవలం పర్యావరణమే కాకుండా, స్థానిక ఆదివాసీ సమాజాల జీవనశైలి, వారి హక్కులు కూడా కాలరాయబడుతున్నాయని రాహుల్ ఆరోపించారు. తరతరాలుగా ఆ అడవులపైనే ఆధారపడి బతుకుతున్న ఆదివాసీలు తమ నివాసాలను, జీవనాధారాలను కోల్పోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశ సంస్కృతిలో భాగమైన ఆదివాసీ వారసత్వాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడటం అందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.




