Sandstorm: రాజస్థాన్లో ఇసుక తుపాను బీభత్సం.. ఒక్కసారిగా కమ్ముకున్న చిమ్మచీకట్లు..
Sandstorm: రాజస్థాన్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు, బికనీర్ సహా పలు ప్రాంతాల్లో దట్టమైన ఇసుక మేఘాలు కమ్ముకోవడంతో పగలే చిమ్మచీకట్లు ఏర్పడ్డాయి.
Sandstorm: రాజస్థాన్లో ఇసుక తుపాను బీభత్సం.. ఒక్కసారిగా కమ్ముకున్న చిమ్మచీకట్లు..
Sandstorm: రాజస్థాన్ రాష్ట్రంలో ఇసుక తుపాను (Sandstorm) తీవ్ర బీభత్సం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భీకర గాలులు వణికించాయి. దట్టమైన మేఘాల రూపంలో ఇసుక ముంచెత్తడంతో, పగటిపూటే ఒక్కసారిగా ఘోరమైన చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రాష్ట్రంలోని చురు, శ్రీగంగానగర్, బికనీర్, సీకర్ తదితర ప్రాంతాల్లో ఈ ఇసుక తుపాను ప్రభావం తీవ్రంగా కనిపించింది. దట్టమైన ఇసుక పొరల కారణంగా కంటిచూపు ఆనని పరిస్థితి ఏర్పడటంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, ఇసుక తుపాను వీచిన కాసేపటికే ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అంతకుముందు శుక్రవారం రాజధాని జైపుర్లోనూ ఇదే విధమైన వాతావరణం కనిపించగా.. ధోల్పుర్ జిల్లాలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో నెలకొన్న ఈ విపరీత వాతావరణ పరిస్థితులపై జైపుర్లోని వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్లో ఈ తరహా వాతావరణం మరో నాలుగైదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది.
అలర్ట్ జారీ చేసిన డివిజన్లు: జైపుర్, అజ్మేర్, బికనీర్, కోటా, జోధ్ఫుర్, ఉదయ్పుర్. ఈ ప్రాంతాలలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. గాలులతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.




