Shocking Video: ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది! గాల్లోకి ఎగిరిన మనిషి!
Shocking Video: ఉత్తరప్రదేశ్లో బుధవారం సంభవించిన భారీ తుపాను పెను విషాదాన్ని, భయాందోళనలను మిగిల్చింది.
Shocking Video: ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది! గాల్లోకి ఎగిరిన మనిషి!
Shocking Video: ఉత్తరప్రదేశ్లో బుధవారం సంభవించిన భారీ తుపాను పెను విషాదాన్ని, భయాందోళనలను మిగిల్చింది. ప్రకృతి ప్రకోపానికి అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోగా, బరేలీ జిల్లాలో జరిగిన ఒక ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బలమైన గాలుల ధాటికి ఒక వ్యక్తి రేకుల షెడ్డుతో పాటు గాలిలోకి ఎగిరిపోయిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పెళ్లి మంటపంలో ఊహించని ప్రమాదం
బరేలీ జిల్లాకు చెందిన నన్హే మియాన్ అనే వ్యక్తి ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ఆ సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పెను గాలులు వీచాయి. వేడుక కోసం వేసిన రేకుల షెడ్డు గాలికి ఎగిరిపోకుండా ఉండేందుకు నన్హే దానిని గట్టిగా పట్టుకున్నాడు. అయితే, గాలి తీవ్రత ఊహించని స్థాయిలో ఉండటంతో, ఆ షెడ్డుతో పాటే అతను కూడా గాలిలోకి ఎగిరిపోయాడు. చూస్తుండగానే అతను ఆకాశంలోకి కొట్టుకుపోవడంతో అక్కడ ఉన్నవారంతా హాహాకారాలు చేశారు.
పొలంలో పడిపోయిన బాధితుడు
కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ రేకుల షెడ్డు కింద పడిపోయినప్పటికీ, గాలి వేగానికి నన్హే మరికొంత దూరం కొట్టుకుపోయి చివరకు ఒక పొలంలో పడిపోయాడు. ఈ భీకర ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని రెండు కాళ్లు, చేతులు విరిగిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలతో బయటపడటం అద్భుతమని స్థానికులు చర్చించుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 89 మందికి పైగా మృతి
గత బుధవారం కురిసిన భారీ వర్షాలు, పిడుగుల ధాటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 89 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక జిల్లాల్లో చెట్లు నేలకూలాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి , పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి సృష్టించిన ఈ విధ్వంసం రాష్ట్ర ప్రజలను కోలుకోలేని దెబ్బ తీసింది.
ముఖ్యమంత్రి తక్షణ సాయం ప్రకటన
రాష్ట్రంలో నెలకొన్న ఈ భయానక పరిస్థితులపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులను సైతం ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.




