Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

Sonia Gandhi: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజసభ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థతకు గురవడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

KVD Varma
Published on: 25 March 2026 7:54 AM IST
Sonia Gandhi: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజసభ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు
X

Sonia Gandhi

Sonia Gandhi: కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఆరోగ్యం మంగళవారం రాత్రి అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. 79 ఏళ్ల సోనియా గాంధీ అస్వస్థతకు గురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఢిల్లీలోని ప్రసిద్ధ సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం, నిపుణులైన వైద్యుల బృందం ఆమె పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, సోనియా గాంధీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. నిన్న రాత్రి 12 గంటల తర్వాత, సోనియా గాంధీకి అకస్మాత్తుగా అస్వస్థతగా అనిపించింది. ఆమెకు ఛాతీ నొప్పి మొదలైంది. ఆ తర్వాత, ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి సీనియర్ డాక్టర్, డాక్టర్ అనూప్ బసు పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందం ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.

కొంత కాలంగా..

ఆమె పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. వాయు కాలుష్యం, ఆకస్మిక వాతావరణ మార్పులే ఆమె ఆరోగ్య సమస్యలకు కారణమని భావిస్తున్నారు. సోనియా గాంధీకి శ్వాసకోశ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆమె ఆరోగ్య కారణాల వల్ల చాలాసార్లు ఆసుపత్రిలో చేరారు. జనవరిలో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలలో బ్రాంకైల్ ఆస్తమా కొద్దిగా తీవ్రమైనట్లు వెల్లడైంది.

ప్రస్తుతం 72 ఏళ్ల సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా, సోనియా గాంధీ ఇటీవలి సంవత్సరాలలో బహిరంగ కార్యక్రమాలలో తక్కువగా పాల్గొంటున్నారు.

రాహుల్ కేరళ పర్యటన ఉంటుందా?

రాహుల్ గాంధీ ఈరోజు కేరళ వెళ్లాల్సి ఉంది. యూడీఎఫ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఈరోజు కేరళకు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ పతాకం ఆయన ఈరోజు సాయంత్రం 4 గంటలకు కోజికోడ్ బీచ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గోవాల్సి ఉంది. బీచ్‌లోని కార్యక్రమం అనంతరం, ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో కరిపూర్ విమానాశ్రయానికి తిరిగి వెళ్తారని పార్టీ వర్గాలు గతంలో తెలిపాయి. అయితే, సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరడంతో.. రాహుల్ గాంధీ ప్రస్తుతం అక్కడే ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కేరళ పర్యటన పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ వర్గాలు మాత్రం రాహుల్ గాంధీ వస్తారని చెబుతున్నాయి.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story