Tamil Nadu: అన్నాడీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేల గుడ్బై.. సీఎం విజయ్ పార్టీలోకి జంప్!
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో భూకంపం సంభవించింది. ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, అధికార టీవీకే (TVK) పార్టీలో చేరారు.
Tamil Nadu: అన్నాడీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేల గుడ్బై.. సీఎం విజయ్ పార్టీలోకి జంప్!
Tamil Nadu: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే (AIADMK) పార్టీకి కోలుకోలేని భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అన్నాడీఎంకే సీనియర్ ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాథం, జయ్ కుమార్లు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాజీనామా నిర్ణయం తీసుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను కలిసి తమ అధికారిక రాజీనామా లేఖలను సమర్పించారు. స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించిన కొద్దిసేపటికే, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలికిన ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని అధికారిక పార్టీ టీవీకే (తమిళగ వెట్రి కజగం) లో ఈ ముగ్గురు నేతలు అధికారికంగా చేరిపోయారు.
అన్నాడీఎంకే నుంచి ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పక్షంలోకి వెళ్లడంతో తమిళనాడు అసెంబ్లీలో బలబలాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ చేరికతో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ మరింత బలాన్ని పుంజుకోగా.. అన్నాడీఎంకే శిబిరంలో తీవ్ర నైరాశ్యం, ఆందోళన నెలకొన్నాయి.
రాబోయే రోజుల్లో అన్నాడీఎంకేకు చెందిన మరికొందరు అసంతృప్త నేతలు కూడా టీవీకే బాట పట్టే అవకాశం ఉందంటూ చెన్నై పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ భారీ ఊపుతో తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి.




