షాకింగ్: రసగుల్లా తిన్నాడని బాలుడిని తందూరీ పొయ్యిలో పడేశారు!

Rasgulla: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం. రసగుల్లా తిన్నాడని 11 ఏళ్ల బాలుడిని మండుతున్న తందూరీ పొయ్యిలో పడేశాడు ఓ కేటరింగ్ కాంట్రాక్టర్.

Arun Chilukuri
Published on: 18 April 2026 10:39 AM IST
Tandoor Oven
X

షాకింగ్: రసగుల్లా తిన్నాడని బాలుడిని తందూరీ పొయ్యిలో పడేశారు!

Rasgulla: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో పెళ్లి వేడుకలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. కేవలం స్వీట్ల కోసం లోపలికి వస్తున్నాడనే కోపంతో, ఒక కేటరింగ్ కాంట్రాక్టర్ 11 ఏళ్ల బాలుడిని మండుతున్న తందూరీ పొయ్యిలో పడేశాడు.

బస్తీ జిల్లా ఛావనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15న ఒక వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు చమన్‌ (11) అనే బాలుడు తన అమ్మమ్మతో కలిసి హాజరయ్యాడు. వేడుకలో రసగుల్లాలు తింటున్న బాలుడిని చూసి కేటరింగ్ కాంట్రాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాలుడు పదే పదే లోపలికి వస్తున్నాడని కోపంతో ఊగిపోయిన నిందితుడు.. చమన్‌ను అమాంతం ఎత్తుకుని మండుతున్న తందూరీ పొయ్యిపై కూర్చోబెట్టాడు.

భయంతో విలవిల్లాడిన బాలుడు పట్టుతప్పి పొయ్యిలోనే పడిపోయాడు. బాలుడి కేకలు విన్న అతిథులు వెంటనే స్పందించి అతడిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో బాలుడికి ముఖం నుంచి నడుము వరకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితుడు లక్నో మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story