Vande Mataram: జమ్మూ కశ్మీర్‌లో వందేమాతరం వివాదం.. ఎన్‌సీ, కాంగ్రెస్ మధ్య చిచ్చు

Vande Mataram: జమ్మూ కశ్మీర్‌లో అధికారిక కార్యక్రమంలో వందేమాతరం పూర్తి రూపంలో ఆలపించడం నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది.

Arun Chilukuri
Published on: 10 Sept 2026 10:46 AM IST
Vande Mataram
X

Vande Mataram: జమ్మూ కశ్మీర్‌లో వందేమాతరం వివాదం.. ఎన్‌సీ, కాంగ్రెస్ మధ్య చిచ్చు

Vande Mataram: జమ్మూ కశ్మీర్‌లో అధికారిక కార్యక్రమంలో జాతీయ గేయం 'వందేమాతరం' పూర్తి రూపంలో ఆలపించడం అధికార కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ (NC), కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. గేయంలోని ఆరు చరణాలను పూర్తిగా ఆలపించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఎన్సీ మాత్రం దీనిపై భిన్నమైన వాదనను వినిపిస్తోంది.

జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించారు. ఈ క్రమంలో సీఎం ఒమర్ అబ్దుల్లా నిలబడి గౌరవం తెలిపారు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఈ వివాదంపై స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్ వర్గాలు.. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించడం అనేది ఒక నిబంధన ప్రకారం జరుగుతుందని, ఎవరినీ ప్రత్యేకంగా ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశాయి. జూనియర్ భాగస్వామి అయిన కాంగ్రెస్ దీనిపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కడంతో, జేకే కూటమి ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story